News December 7, 2024
ధర్మవరపు సుబ్రహ్మణ్యం అద్దంకి నియోజకవర్గానికి చెందిన వారే

తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. నేడు ఆయన వర్ధంతి. బల్లికురవ మండలం, కొమ్మినేనివారిపాలెంలో 1954లో జన్మించిన ఆయన అనారోగ్య కారణంగా 2013, డిసెంబర్ 7న మరణించారు. ఆయన ప్రాథమిక విద్యను తన స్వగ్రామంలో, 6 నుంచి 10వ తరగతి వరకు అద్దంకిలో చదివారు. ఒంగోలు CSR శర్మ కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించారు.
Similar News
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.


