News August 10, 2024
ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన శనివారం ధర్మసాగర్ మండలం జానకిపురంలో చోటుచేసుకుంది. ధర్మసాగర్ సీఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మళ్లీకుదుర్ల గ్రామానికి చెందిన గురజాల మల్లారెడ్డి, సారంపెళ్లి అమరేందర్ రెడ్డి బైకుపై ధర్మసాగర్ వైపు వెళ్తుండగాఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 13, 2025
ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
News December 13, 2025
రేపు వరంగల్లో టఫ్ ఫైట్..!

జిల్లాలో 117 పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడతపై ఉత్కంఠ నెలకొంది. దుగ్గొండి 33, గీసుగొండ 19, నల్లబెల్లి 29, సంగెం 30 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 117 జీపీలకు ఇప్పటికే 5 ఏకగ్రీవమయ్యాయి. నల్లబెల్లి, దుగ్గొండిలో ఎన్నికలపై BRS, కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా? అన్నట్లు ఉండగా, గీసుగొండలో కొండా కాంగ్రెస్, రేవూరి కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. సంగెంలో పాగా వేసేందుకు చల్లా, రేవూరి వర్గాల మధ్య ఆసక్తికర పోటీ ఉంది.
News December 12, 2025
వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొత్త సమీకరణలు!

WGL తూర్పు కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి మార్పుతో సమీకరణాలు మారిపోతుండగా, కొండా దంపతుల అనుచరుడి ఇంట్లో నేతల మధ్య అంతర్గత చర్చలు జరిగాయి.సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఒక్కటైన తూర్పు నేతలు జిల్లా పార్టీ పదవులపై మంతనాలు జరిపినట్లు సమాచారం. నల్గొండ రమేశ్ ఇంట్లో మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సారయ్య భేటీ అయ్యారు. కీలక నేతలు త్వరలో రాష్ట్ర అధిష్టానాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది.


