News March 19, 2025

ధర్మారంలో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

image

ధర్మారం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గానూ సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని అధికారులు మంగళవారం రోజున సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రసన్న కుమారి, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు.

Similar News

News December 16, 2025

విజయ్ దివస్‌.. యుద్ధ వీరులకు మోదీ, రాజ్‌నాథ్ నివాళులు

image

1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భారత్‌కు విజయాన్ని అందించిన సాయుధ దళాలను ‘విజయ్ దివస్’ సందర్భంగా PM మోదీ స్మరించుకున్నారు. ఇది దేశ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగాలు దేశాన్ని కాపాడాయని, ఈ విజయం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని Xలో ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తూ.. ఈ విజయం త్రివిధ దళాల సమన్వయానికి ప్రతీక అని అన్నారు.

News December 16, 2025

అమెనోరియా సమస్యకు కారణమిదే!

image

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.

News December 16, 2025

జూలూరుపాడు పంచాయతీ ఎన్నిక ఆగడానికి కారణమిదే..!

image

జూలూరుపాడు గ్రామ పంచాయతీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. జూలూరుపాడును ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించడాన్ని సవాలు చేస్తూ స్థానికుడైన తాళ్లూరి రామారావు కోర్టును ఆశ్రయించారు. ఇది మైదాన ప్రాంతమని, రాష్ట్రపతి గెజిట్‌లో ఏజెన్సీగా నోటిఫై కాలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేసింది.