News March 19, 2025
ధర్మారంలో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

ధర్మారం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గానూ సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని అధికారులు మంగళవారం రోజున సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రసన్న కుమారి, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు.
Similar News
News April 24, 2025
భారత్, పాక్ సైనిక బలాలివే!

భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో 2 దేశాల వద్ద ఉన్న సైనిక బలాలేంటో తెలుసుకుందాం.
♦ ఆర్మీ సైనికులు: 14,55,550 (భారత్), 6,54,000 (పాక్)
♦ వైమానిక ట్యాంకర్లు: 6 (భారత్), 4 (పాక్)
♦ అణు జలాంతర్గాములు: 293(భారత్), 121 (పాక్)
భారత్→ 2,299 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 జెట్స్
పాక్→ 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 జెట్స్
▶ అలాగే, భారత్ వద్ద 1.15M రిజర్వ్, 25 లక్షల పారా మిలిటరీ బలగాలున్నాయి.
News April 24, 2025
తారాబు జలపాతం వద్ద పెందుర్తి విద్యార్థి గల్లంతు

పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి తారాబు జలపాతంలో గల్లంతైనట్లు ఎస్ఐ రమణ తెలిపారు. నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చినట్లు చెప్పారు. వీరిలో వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలుకి చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.
News April 24, 2025
చింతలపూడి: పరారీలో ఉన్న నలుగురి అరెస్ట్

కామవరపుకోట మండలంలో పాత నాటు సారా కేసులలో పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. జలపావారిగూడెంకు చెందిన జువ్వల సత్యవతి, వెంకటాపురానికి చెందిన రాజులపాటి దుర్గారావు, ఆడమిల్లికి చెందిన మిరియాల శరత్ కుమార్ (బెల్లం సరఫరా చేసిన వ్యక్తి), కొత్తగూడెంకి చెందిన రాచప్రోలు మల్లికార్జునరావులను అరెస్ట్ చేశామన్నారు. చింతలపూడి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు.