News February 10, 2025

ధర్మారం: పెళ్లికి ప్రియురాలు నో.. యువకుడి సూసైడ్

image

ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్(22) తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది గతనెల 29న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, చికిత్స పొందుతూ అజయ్ ఆదివారం మృతి చెందినట్లు ధర్మారం SI శీలంలక్ష్మణ్ తెలిపారు. అజయ్ తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 14, 2025

కరీంనగర్: రేపు SPECIAL లోక్ అదాలత్

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రేపు ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కే.రాణి తెలిపారు. ఈ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాదాల పరిహారం వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కారమవుతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.

News November 13, 2025

కరీంనగర్: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

image

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. ఈ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.

News November 13, 2025

శాతవాహన ఆర్ట్స్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన

image

శాతవాహన విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో కళాశాల ప్రిన్సిపల్ సుజాత అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, కొత్తపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, షీ టీమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత అవగాహన కల్పించారు.