News March 30, 2024
ధర్మారం: మనవడిపై తాత గొడ్డలి దాడి
ధర్మారం మండలం నంది మేడారంలో సామంతుల మహేష్ (28) శనివారం ఉదయం 1 గంట ప్రాంతంలో హత్యాయత్నానికి గురయ్యాడు. మహేష్ నిద్రిస్తున్న సమయంలో అతడి తాత సామంతుల కొమరయ్య (66) గొడ్డలితో ముఖంపై నరికి హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు మహేష్ మేనమామ కట్ట కొమురయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై టి.సత్యనారాయణ తెలిపారు. సామంతుల కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
Similar News
News October 5, 2024
హుజూరాబాద్లో దారుణ హత్య
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాజపల్లెలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 5, 2024
కోరుట్ల ఎస్సై- 2 శ్వేతను సస్పెండ్ చేసిన ఐజీ
జగిత్యాల జిల్లాలో కోరుట్ల పోలీస్స్టేషన్లో ఎస్సై-2 గా పనిచేసిన శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిపై గత నెల29న ఎస్సై శ్వేత చేయిచేసుకున్నారని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీస్శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా ఎస్సై-2 శ్వేతను సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటన జారీ చేశారు.
News October 5, 2024
కాటారం:అరుదైన అటవీ జంతువును తరలిస్తున్న ముఠా పట్టివేత?
అటవీ జంతువుల్లో అరుదుగా లభించే ‘అలుగు’ను తరలిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం మేరకు అలుగును తరలిస్తున్న ముఠాను కాటారం మండలం మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయసమాచారం. ఈముఠాలో కాటారం సబ్ డివిజన్కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, మరో ఇద్దరూ ఉన్నట్లు తెలిసింది. కాగా సదరు అలుగు విలువ రూ. 70లక్షల నుంచి రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం.