News April 29, 2024
ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

TTD ఈవోగా మరో రెండు నెలలు పాటు ధర్మారెడ్డే కొనసాగనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి EOగా నియమించారు. ఆయన డిప్యుటేషన్ మే 14తో ముగియనుంది. ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు పొడిగించాలని CM జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈమేరకు ఆయన డిప్యుటేషన్ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
Similar News
News November 22, 2025
GDనెల్లూరులో తారస్థాయికి వర్గపోరు..?

GDనెల్లూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. MLA థామస్, భీమనేని చిట్టిబాబు మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిచ్చు రాజేస్తోంది. భీమినేని చిట్టిబాబు జిల్లా అధ్యక్షుని పదవి రేసులో ఉన్నారు. దీనిని థామస్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారట. థామస్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా, చిట్టిబాబు వెంట నడుస్తున్నట్లు సమాచారం. ఇది ఎటు వెళుతుందో చూడాలి మరి.
News November 21, 2025
చిత్తూరు: పేదరికాన్ని జయించినా.. విధిని ఓడించలేక.!

అసలే పేదరికం.. మరోవైపు తల్లిలేని లోటు. అయినా ఆమె పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. ఓ వైపు నాన్నకు తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలు మోస్తూ <<18347620>>కష్టాల కడలి<<>>ని దాటి MLHP ఉద్యోగం సంపాదించింది ఆదిలక్ష్మి. పెళ్లి చేసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ విధికి ఇది నచ్చలేదోమో. ఆమె బిడ్డ రూపంలో మరోసారి పరీక్షించింది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్న ఆమె కూతురి విషయంలో కలత చెంది ఆత్మహత్య చేసుకుంది.
News November 21, 2025
చిత్తూరు: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట దిగుబడులు తగ్గి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పచ్చిమిరప రూ.40 నుంచి రూ.60కి, బీర రూ.40-రూ.60, వంకాయలు రూ.90-రూ.120 వరకు చేరుకున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


