News April 29, 2024
ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

TTD ఈవోగా మరో రెండు నెలలు పాటు ధర్మారెడ్డే కొనసాగనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి EOగా నియమించారు. ఆయన డిప్యుటేషన్ మే 14తో ముగియనుంది. ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు పొడిగించాలని CM జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈమేరకు ఆయన డిప్యుటేషన్ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
Similar News
News November 19, 2025
కాణిపాకం అభివృద్ధికి రూ.25 కోట్లు

కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.25 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 28న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సు, సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్లను నిర్మించేందుకు రూ.25కోట్లు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News November 19, 2025
చిత్తూరు రైతులకు నేడు రూ.136.46 కోట్ల జమ

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.
News November 18, 2025
చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.


