News April 29, 2024

ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

image

TTD ఈవోగా మరో రెండు నెలలు పాటు ధర్మారెడ్డే కొనసాగనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి EOగా నియమించారు. ఆయన డిప్యుటేషన్ మే 14తో ముగియనుంది. ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు పొడిగించాలని CM జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈమేరకు ఆయన డిప్యుటేషన్‌ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

Similar News

News November 7, 2025

కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల స్థాపన ఇక్కడే.!

image

☞ కుప్పం (M) పలార్లపల్లి వద్ద అలీఫ్ ☞ అనిమిగానిపల్లి సమీపంలో ఆదిత్య బిర్లా
☞శాంతిపురం (M) తంబిగానిపల్లి వద్ద మదర్ డెయిరీ ☞ రామకుప్పం(M) విజిలాపురం వద్ద ఈరైస్
☞గుడిపల్లి (M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ACE, శ్రీజ డెయిరీ, SVF సోయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
☞ మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటు
☞ 8న వర్చువల్‌గా CM చంద్రబాబు శంకుస్థాపన.

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.

News November 6, 2025

దూడపై చిరుతపులి దాడి.?

image

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.