News February 10, 2025

ధర్మార: ప్రియురాలు నో చెప్పిందని యువకుడు సూసైడ్

image

ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్ (22) తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోను అని అనడంతో మనస్తాపం చెంది గతనెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా,చికిత్స పొందుతూ అజయ్ ఆదివారం మృతిచెందినట్లు ధర్మారం SI శీలంలక్ష్మణ్  తెలిపారు. అజయ్ తండ్రి గడ్డం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News March 12, 2025

జగిత్యాల: రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలి: అదనపు కలెక్టర్

image

రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ (DCC) త్రైమాసిక సమీక్షా సమావేశoలో ఆమె మాట్లాడారు. జిల్లా బ్యాంకింగ్ రంగ ప్రగతిని సమీక్షించడంతోపాటు ప్రాధాన్యత రంగాలకు రుణాలు అందుబాటు, వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ కుమార్ తదితర అధికారులున్నారు.

News March 12, 2025

ఎల్లుండి మద్యం షాపులు బంద్

image

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.

News March 12, 2025

పుంగనూరు: రేపు శ్రీవారి కల్యాణోత్సవం

image

పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

error: Content is protected !!