News September 5, 2024

ధవళేశ్వరంలో 10.90 అడుగులకు చేరిన నీటిమట్టం

image

గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు 10.90 అడుగులకు నీటిమట్టం చేరింది. 8,60,994 క్యూసెక్కుల వరద నీటిని కిందికి విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద ఉదయం 8.గంటలకు గోదావరి నీటిమట్టం 44.20 అడుగులకు చేరిందని క్రమంగా పెరుగుతోందని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

Similar News

News February 26, 2026

దేవరపల్లి: తలపై రాయి పడి కార్మికుడు మృతి

image

దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఓ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో అవిటి యేసు (42) అనే కార్మికుడు మృతి చెందాడు. పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు తలపై రాయి పడటంతో తీవ్ర గాయమైందని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 26, 2026

రాజమండ్రి: కల్తీ పాలను చిటికెలో కనిపెట్టండి ఇలా!

image

నిత్యం మనం వాడే పాలు కల్తీ అవుతున్నాయా? ఈ చిన్న పరీక్షలతో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు సహజ సిద్ధమైన తీపి, క్రీమ్ వాసన కలిగి ఉంటాయని, చేదుగా లేదా రసాయన వాసన వస్తే అవి కల్తీవని గుర్తించాలి. కొద్దిపాటి పాలలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు, ఆ పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కలిపినట్లు నిర్ధారించుకోవాలని నిపుణులు తెలిపారు.

News February 26, 2026

RJY: రీనాల్ ఫెయిల్యూర్ కేసులు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

image

ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసు, ఆరోగ్య, రెవిన్యూ విభాగాలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సమయాల్లో 9494060060 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కమిషనర్ రాహుల్ మీనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.