News November 10, 2024
ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!

భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.
Similar News
News November 24, 2025
నిజామాబాద్: స్థానిక పోరుకు సిద్ధమా..!

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 31 మండలాల్లోని 545 GPలు, 5022 వార్డులు, 5053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.
News November 23, 2025
NZB: పల్లెల్లో టెన్షన్ టెన్షన్.. రిజర్వేషన్లు మారితే..!

గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. మళ్లీ పల్లెల్లో సందడి, టెన్షన్ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కలతో సర్పంచి స్థానాలకు ఆర్డీవోలు, కులగణనతో వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా BC, SC, STలకు కేటాయిస్తారు. ఆపై మహిళలకు 50 శాతం స్థానాలు లక్కీ డ్రా తీస్తారు. రిజర్వేషన్లు మారితే లీడర్లు తమ భార్యలు, తల్లులను బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు.
News November 23, 2025
SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.


