News March 21, 2025
ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.
Similar News
News April 24, 2025
ఖమ్మం: పంట బీమా పథకంపై మంత్రి తుమ్మల సమావేశం

పంట బీమా పథకం అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం, యాసంగి కాలాల్లో ఏయే పంటలకు ఏయే విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై అధికారులతో చర్చిస్తున్నారు. ప్రధాన పంటలకు బీమా ప్రీమియం అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పంట బీమా పథకంలో భాగంగా రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
News April 24, 2025
KMM: తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్

వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో వేసవి కాలంలో తాగునీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణంపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News April 23, 2025
ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత: ఖమ్మం కలెక్టర్

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మా ఇంటి మణిద్వీపం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మధిర మండలం దెందుకూరులో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మన ఆలోచనల్లో మార్పు వస్తే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు, మగ పిల్లలతో సమానంగా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు.