News December 11, 2024
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అంబటి రాంబాబు
కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. పలువురు రైతులతో ధాన్యం కొనుగోలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు లేవని, తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోవాల్సి వస్తుందని అంబటి విమర్శించారు.
Similar News
News January 19, 2025
గుంటూరులో CA విద్యార్థి ఆత్మహత్య
బ్రాడీపేటలో ఆత్మహత్యకు పాల్పడింది CA చివరి సంవత్సరం చదువుతున్న కె.నాగప్రసాద్ (27) గా అరండల్ పేట పోలీసులు నిర్ధారించారు. గూడూరు పట్టణానికి చెందిన నాగప్రసాద్ ఆదివారం హాస్టల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనతో విజ్ఞాన కేంద్రానికి చిరునామాగా ఉన్న బ్రాడీపేటలో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నాగప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News January 19, 2025
పిట్టలవానిపాలెంలో రోడ్డు ప్రమాదం
పిట్టలవానిపాలెం మండలం భావనారాయణపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
News January 19, 2025
డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద పోలీసుల విచారణ
మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అలాగే జాతీయ పార్టీ కార్యాలయం వద్ద శనివారం డ్రోన్ కలకలం రేపిన సంగతి విధితమే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు క్యాంపు కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎటువైపు నుంచి డ్రోన్ వచ్చింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.