News March 30, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: అదనపు కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, సివిల్ సప్లై డీఎం అంబాదాస్ రాజేశ్వర్ పాల్గొన్నారు.

Similar News

News February 26, 2026

కల్వకుర్తి: మార్చి 1న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక

image

మార్చి 1న కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. అండర్-14, అండర్-20, క్రీడాకారులకు 100, 200 మీటర్ల పరుగు పందెం క్రీడలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రీడలలో పాల్గొనే విద్యార్థులు పుట్టిన తేదీ సర్టిఫికెట్లతో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

News February 26, 2026

NCERT పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం

image

‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా లోతైన కుట్ర చేసినట్లు అనిపిస్తోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, NCERT ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించారు. విచారణ సందర్భంగా NCERT అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పింది.

News February 26, 2026

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 99 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 99 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో 52 కేసులు నమోదు కాగా, సెంట్రల్ జోన్‌లో 22, వెస్ట్ జోన్‌లో 8, ఈస్ట్ జోన్ పరిధిలో 17 కేసులు నమోదయ్యాయి.