News April 8, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: అడిషనల్ కలెక్టర్

రబీ సీజన్ను పురస్కరించుకొని కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చర్యలు తీసుకోవాలని తహాశీల్దార్లను ఆదేశించారు. ప్రతి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేసే వరకు రెవెన్యూ వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైఅధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
Similar News
News April 19, 2025
ఒకే రోజున పవన్-విజయ్ సినిమాలు రిలీజ్?

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. తొలుత మే 9న ‘HHVM’ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా వివిధ కారణాలతో పోస్ట్పోన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మధ్యలో పవన్ డేట్స్ ఇచ్చి, షూటింగ్ పూర్తయితే ఈ చిత్రాన్ని మే 30న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేరోజున ‘కింగ్డమ్’ కూడా రానుంది.
News April 19, 2025
జీజీహెచ్లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్లో తన ప్లాట్లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 19, 2025
ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతోంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?