News February 11, 2025
ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు సంబంధించిన సన్నద్ధతపై ఆయన సమీక్షా నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తదితర అధికారులున్నారు.
Similar News
News November 17, 2025
రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.
News November 17, 2025
రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.
News November 17, 2025
సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.


