News February 11, 2025
ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు సంబంధించిన సన్నద్ధతపై ఆయన సమీక్షా నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తదితర అధికారులున్నారు.
Similar News
News December 4, 2025
భారీ జీతంతో పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News December 4, 2025
నిర్మల్: సర్పంచ్ బరిలో దివ్యాంగుడు

ప్రజాసేవకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించేందుకు శంకర్ సిద్ధమయ్యాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల–బి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశాడు. 2 చేతులు లేకున్నా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టాడు. శంకర్ నామినేషన్ వేసిన వెంటనే గ్రామస్థులు అతడిని అభినందించారు. రాజకీయాలు దివ్యాంగులకు అందని ద్రాక్ష కాకూడదని, తాము కూడా ప్రజాసేవలో ముందుంటామని శంకర్ నిరూపించాడు.
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండండి: వైద్యులు

AP: ‘<<18454752>>స్క్రబ్ టైఫస్<<>>’ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


