News November 6, 2024
ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, పరికరాలు అందుబాటులో ఉండాలని చెప్పారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లుపై సంబంధిత అధికారులతో తన కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ సమీక్షించారు.
Similar News
News September 14, 2025
శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.
News September 14, 2025
శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.
News September 14, 2025
శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రానున్న మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంద్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రం మీద వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్ప పీడన ప్రభావం వలన సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడతాయని హెచ్చరించారు.