News April 8, 2025
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి: వరంగల్ కలెక్టర్

యాసంగి ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్య శారద దేవి తెలిపారు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 2024-25 సంవత్సరానికి 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.
Similar News
News April 17, 2025
నర్సంపేట: రాజకీయ భీష్ముడిగా పేరు.. ఈయన గురించి మీకు తెలుసా?

నర్సంపేటలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా మద్ధికాయల ఓంకార్కు గుర్తింపు ఉంది. 1972 నుంచి 1989 వరకు వరుసగా 5 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి MLAగా (MCPI(U))గెలిచి రికార్డు సృష్టించారు. రాజకీయ భీష్మునిగా పేరు ఉన్న ఈయన.. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ చేత పట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. 1924లో జన్మించిన ఆయన 17 OCT 2008లో మరణించారు.
News April 17, 2025
ఎంజీఎంలో దొంగలు ఉన్నారు.. జాగ్రత్త!

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఆవరణలో మట్టెవాడ పోలీసులు బుధవారం బ్యానర్ కట్టారు. ఈ మేరకు ఆసుపత్రికి వచ్చే వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆసుపత్రిలో గుర్తు తెలియని దొంగలు తిరుగుతున్నారని, వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
News April 17, 2025
వరంగల్ జిల్లాలో పత్తి సాగు ప్రశ్నార్థకమేనా?

వరంగల్ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారని అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.