News March 5, 2025
ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలని వినియోగించుకోండి: జేసీ

రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు. బుధవారం బోగోలు మండలం చెంచులక్ష్మిపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ, సొసైటీ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.
Similar News
News March 6, 2025
సహకార సంఘాలను బలోపేతం చేస్తాం: కలెక్టర్

జిల్లాలోని వ్యవసాయ, పాడి, మత్స్య సహకార సంఘాలను పటిష్టపరిచి, సభ్యులకు మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సహకార రంగం ద్వారా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప వివరించారు.
News March 6, 2025
నెల్లూరు: హౌసింగ్ AE సస్పెన్షన్

జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.
News March 6, 2025
నెల్లూరు: ‘సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’

నెల్లూరుకు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు మ్యాట్రీమోని ద్వారా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. విజయవాడకు చెందిన అమీర్ఖాన్ పరిచయమయ్యాడు. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినని నమ్మించి రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద తీసుకున్నాడు. ఈ క్రమంలో భర్త అమీర్ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అని తెలియడంతో భార్య ప్రశ్నించగా.. దాడి చేశాడు. ఆమె నెల్లూరు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.