News June 30, 2024

ధాన్యం బకాయిలపై మంత్రి దుర్గేశ్ హామీ

image

గత ప్రభుత్వంలో రైతులకు బకాయిపడిన ధాన్యం విక్రయాల డబ్బులను త్వరలో చెల్లిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆదివారం ఆయన నిడదవోలులో మీడియాతో మాట్లాడుతూ..గతంలో రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం విక్రయాల నగదును చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. జూలై 1న లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లుచేశామన్నారు.

Similar News

News November 25, 2025

ప.గో: ఆన్‌లైన్‌లో పందెంకోళ్లు

image

సంక్రాంతి సమీపించడంతో కోడిపుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. బైక్‌లు, గృహోపకరణాల తరహాలోనే.. సోషల్‌ మీడియా వేదికగా పుంజుల ఫొటోలు, వీడియోలు, జాతి, బరువు వంటి వివరాలను పోస్ట్‌ చేస్తూ విక్రేతలు ఆకర్షిస్తున్నారు. పాలకొల్లులో రహదారుల పక్కన విక్రయాలు సాగుతుండగా.. దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. జాతి, సైజును బట్టి ఒక్కో కోడి రూ.1500 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు.

News November 25, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

News November 25, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.