News February 16, 2025

ధీరుని వీరత్వ చిహ్నం.. గొల్లగట్టు జాతర

image

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగన్నజాతర. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లింగమంతుల స్వామి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. వందల ఏళ్ల కింద తన జాతి ఉనికిని.. తమ వారి పశుసంపదను క్రూరమృగాల నుంచి, ఇతర తెగల నుంచి నిత్యం పోరాడుతూ కాపాడిన ధీరుని వీరత్వ చిహ్నమే ఈ జాతర. ఒ లింగా.. ఓ లింగా.. అంటూ జనం గుండెలు చేసే శబ్దాలతో ఐదురోజులు ఈ ప్రాంతం దద్దరిల్లుతుంది. మరి మీరు జారతకు వెళ్తున్నారా..?

Similar News

News April 17, 2026

మహిళా బిల్లు చదరంగం: ఎవరి ఎత్తులు వారివే!

image

మహిళా రిజర్వేషన్ల అమలుపై అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు పతాక స్థాయికి చేరాయి. రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలని BJP ప్లాన్ వేసింది. బిల్లును అడ్డుకుంటే ‘మహిళా వ్యతిరేకులు’గా ముద్ర వేయొచ్చన్నది అధికార పక్షం ప్లాన్. దీనికి విపక్షాలు ‘కుల గణన’ అస్త్రంతో కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకున్నాయి. OBC కోటా లేని రిజర్వేషన్లు అసంపూర్ణమంటూ BJPకి కౌంటరిస్తున్నాయి.

News April 17, 2026

కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం!

image

పంచాయతీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జిల్లాలోని 385 పంచాయతీల్లో మొత్తం 12,58,456 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాకినాడ రూరల్‌లో పెండింగ్‌లో ఉన్న 6 పంచాయతీలతో సహా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News April 17, 2026

బుగ్గారం ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులపై కలెక్టర్ తనిఖీ

image

బుగ్గారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, మండల రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ తదితర నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీఏ పీడీ రఘువరన్, తహసీల్దార్ భూమేశ్వర్, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వాసవి, సర్పంచ్ నక్క రాజవ్వ, అధికారులు పాల్గొన్నారు.