News February 16, 2025
ధీరుని వీరత్వ చిహ్నం.. గొల్లగట్టు జాతర

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగన్నజాతర. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లింగమంతుల స్వామి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. వందల ఏళ్ల కింద తన జాతి ఉనికిని.. తమ వారి పశుసంపదను క్రూరమృగాల నుంచి, ఇతర తెగల నుంచి నిత్యం పోరాడుతూ కాపాడిన ధీరుని వీరత్వ చిహ్నమే ఈ జాతర. ఒ లింగా.. ఓ లింగా.. అంటూ జనం గుండెలు చేసే శబ్దాలతో ఐదురోజులు ఈ ప్రాంతం దద్దరిల్లుతుంది. మరి మీరు జారతకు వెళ్తున్నారా..?
Similar News
News March 21, 2025
సివెజ్ ప్లాంట్కు స్థల పరిశీలన చేయాలి: మేయర్

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేయనున్న సివేజ్ ప్లాంట్కు స్థల పరిశీలన చేయాలని అధికారులను మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఆరేపల్లి ప్రాంతంలో గల అగ్రికల్చర్ కేంద్రం, బుల్లికుంట ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. ఎస్టీపీల ఏర్పాటుకు గుర్తించబడిన జోన్లలో ఇప్పటికి కొన్ని స్థానాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
News March 21, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, ఛైర్మన్

కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాణి దర్గాలో పీఠాధిపతి ఖుస్రు పాషా ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
News March 21, 2025
నల్లమడ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

నల్లమడ మండలంలోని ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తికి పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. 2019 మార్చి 22వ తేదీ కదిరి పోలీస్ స్టేషన్లో చిరంజీవిపై పోక్సో కేసు నమోదు అయిందన్నారు. అనంతపురం జిల్లా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిపై విచారణ జరిపి 20 ఏళ్ల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధించడం జరిగిందన్నారు.