News March 6, 2025

ధూళ్‌మిట్ట: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

image

ధూళ్‌మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు భోషనబోయిన సాయిలు(70) ప్రమాదవశాత్తు తన వ్యవసాయ బావిలో పడి బుధవారం రాత్రి మరణించారు. బావిలో పంపు మోటర్ చెడిపోవడంతో దానికి సాయిలు మరమ్మతులు చేపట్టారు. అనంతరం బావిలో నుంచి పైకి ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.

Similar News

News November 27, 2025

NZB: జిల్లాలో తొలి రోజు నామినేషన్లు ఎన్ని అంటే?

image

నిజామాబాద్ జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో GP ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం వరకు దాఖలైన నామినేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. 184 సర్పంచి స్థానాలకు సంబంధించి 140 నామినేషన్లు, 1,642 వార్డు స్థానాలకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు.

News November 27, 2025

నాగర్‌కర్నూల్‌లో తొలిరోజు 121 నామినేషన్లు

image

నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఆరు మండలాల్లోని 151 గ్రామ పంచాయతీలకు ఎన్నికల అధికారులు గురువారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. మొదటిరోజు 121 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్లకు మరో రెండు రోజులే అవకాశం ఉండడంతో, రేపు, ఎల్లుండి పెద్ద మొత్తంలో నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

News November 27, 2025

BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత

image

AP: BC విద్యార్థులకు DEC 14నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ‘వంద మందికి శిక్షణిచ్చేలా BC భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డున్నవారు అర్హులు. DEC 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న అర్హత పరీక్ష, 11న ఫలితాలు వెల్లడిస్తారు. 100 సీట్లలో BCలకు 66, SCలకు 20, STలకు 14 సీట్లు కేటాయిస్తున్నాం. మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం’ అని తెలిపారు.