News June 5, 2024

ధ్రువపత్రాన్ని అందుకున్న సీఎం రమేష్

image

అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సీఎం రమేశ్ జిల్లా కలెక్టర్ రవి సుభాష్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.

Similar News

News October 16, 2025

విశాఖ: ‘పవన్‌ కళ్యాణ్‌ను కలిసేదాకా ఊరెళ్లను’

image

బెట్టింగ్‌ యాప్‌ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ విశాఖ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వెళ్లాడు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్‌లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్‌ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.

News October 16, 2025

విశాఖలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

image

షీలానగర్-సబ్బవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే విస్తరణతో విశాఖలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. షీలానగర్ నుంచి సబ్బవరం నేషనల్ హైవేకి 13KM మేర సిక్స్‌ లేన్ రోడ్డు వేయనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.964 కోట్లు మంజూరు చేయగా.. PM మోదీ నేడు కర్నూలు జిల్లా నుంచి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి పూర్తయితే విశాఖ పోర్టు నుంచి కార్గో నగరంలోకి రాదు. గాజువాక, విమానాశ్రయం వైపు వెళ్లే వారి ప్రయాణం సుగమం అవుతుంది.

News October 15, 2025

610 క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ: జీవీఎంసీ సీఎంవో

image

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని జీవీఎంసీ సీఎంవో నరేష్ కుమార్ కోరారు. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నామన్నారు. దీన్ని 100% నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 610 క్లాప్ వాహనాలు, 65 ఇ-ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.