News June 5, 2024
ధ్రువపత్రాన్ని అందుకున్న సీఎం రమేష్

అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సీఎం రమేశ్ జిల్లా కలెక్టర్ రవి సుభాష్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.
Similar News
News November 7, 2025
రూ.10 లక్షల కోట్ల ఒప్పందాలు.. 7.30 లక్షల ఉద్యోగుల కల్పన

రాష్ట ప్రభుత్వం ఈ నెల 14, 15న నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసి పది లక్షల కోట్ల ఒప్పందాలు, 7.30 లక్షల ఉద్యోగుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. GVMC ప్రధాన కార్యాలయంలో సదస్సుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. జీరో వేస్ట్ కాన్సెప్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కే బాటిల్స్ వినియోగిస్తున్నామన్నారు.
News November 6, 2025
‘గూగుల్ సెంటర్తో వందల సంఖ్యలోనే ఉద్యోగాలొస్తాయి’

విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు రావని, వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింత మోహన్ అన్నారు. సుందర్ పిచాయ్ పేదవాడు కాదని అపర కోటీశ్వరుడన్నారు. 500 ఎకరాలు ఇచ్చి భూములతో వ్యాపారం చేయడం చంద్రబాబుకు పిచాయ్కి మధ్య ఉన్న బంధం ఏంటో వెల్లడించాలన్నారు. ఈనెల 31లోపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదని కేంద్రం ప్రకటన చేయలన్నారు.
News November 6, 2025
విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.


