News April 3, 2025

నంగునూర్: గులాబీ పువ్వులతో కనువిందు

image

ఆకాశం లేత నీలం రంగులో మెరిసిపోతోంది. అక్కడక్కడ తెల్లటి మేఘాలు తేలియాడుతున్నాయి. నేలపై రాలిన లేత గులాబీ రంగు పూలతో వీధి చాలా అందంగా ఉంది. ఈ సమ్మోహన దృశ్యం సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం గట్లమల్యల గ్రామంలో చోటు చేసుకుంది. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో నాటిన మొక్క నేడు వృక్షంగా మారి గులాబి పువ్వులతో ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఒక పెద్ద చెట్టు గులాబీ రంగు పూలతో పూర్తిగా నిండిపోయి ఆకర్షిస్తోంది.

Similar News

News April 18, 2025

గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు బలికొంది. ఎస్ఐ వివరాలు.. గద్వాలకు చెందిన పవన్(22) HYDలో ఎంటెక్ చేస్తున్నాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన పవన్ వివిధ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని ఆడుతూ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయమై తండ్రితో చెప్పగా రూ.98,200 పంపించాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బైక్, ఐపోన్ అమ్మేశాడు. ఇంకా అప్పులు ఉండటంతో ఉరేసుకున్నాడు.

News April 18, 2025

రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. నిన్న ఫైనల్ ‘కీ’ని రిలీజ్ చేసి, మళ్లీ వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

News April 18, 2025

ఖమ్మం: అనుమానస్పద స్థితిలో బావిలో బాలుడి మృతదేహం

image

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

error: Content is protected !!