News April 6, 2025
నంచర్ల- గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
అర్జీలకు పరిష్కారం చూపండి: కలెక్టర్ ఆదేశం

ప్రజల అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు.
News April 21, 2025
ఉమ్మడి అనంత జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి అనంత జిల్లాలో డీఎస్సీ ద్వారా 807 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-314 ➤ BC-A:60 ➤ BC-B:75
➤ BC-C:9 ➤ BC-D:60 ➤ BC-E:29
➤ SC- గ్రేడ్1:20 ➤ SC-గ్రేడ్2:52
➤ SC-గ్రేడ్3:66 ➤ ST:49 ➤ EWS:73
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం<<16156843>> ఇక్కడ క్లిక్<<>> చేయండి.
News April 21, 2025
ATP: పోస్టులు 807.. పోటీ వేలల్లో..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఎస్సీ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాకు 807 పోస్టులు మంజూరు కాగా టీచర్ ఉద్యోగాలకు సుమారు 40వేల మంది పోటీ పడనున్నట్లు సమాచారం. 202 ఎస్జీటీ పోస్టులకూ 24 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశముంది. దీంతో ఒక్కో టీచర్ పోస్టుకు సగటున 40 మంది, ఒక్కో ఎస్జీటీ పోస్టుకు 120 మందికిపైగా పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.