News April 24, 2025
నందలూరు: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

నందలూరు మండలం ఎర్ర చెరువు పల్లెకు చెందిన హత్య కేసులో నిందితుడు నాగ ప్రతాప్ రెడ్డిని నాగిరెడ్డిపల్లి గ్రామం పాత R&B బంగ్లా వద్ద అరెస్ట్ చేసినట్లు రాజంపేట ASP మనోజ్ రామనాధ్ హెగ్డే తెలిపారు. గురువారం ఆయన వివరాల మేరకు.. నిందితుడు 2024 జూలై 27న తన కోడిపుంజును దొంగిలించాడని సాతుపల్లి వెంకట రెడ్డి తిట్టడంతో అతన్ని హతమార్చాడు. అప్పటి నుండి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడన్నారు.
Similar News
News April 25, 2025
143 మంది యాక్టర్లతో వాట్సాప్ గ్రూప్.. కానీ: నాని

బన్నీ, రానా, రామ్ చరణ్, మంచు లక్ష్మి సహా 143 మంది తెలుగు యాక్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఉందని హీరో నాని తెలిపారు. అయితే అది ప్రస్తుతం యాక్టివ్గా లేదని, తాను కూడా ఆ గ్రూప్ను మ్యూట్లో ఉంచుతానని చెప్పారు. సినిమాలను ప్రోత్సహించుకోవడానికి దాన్ని క్రియేట్ చేశామన్నారు. అప్పట్లో బాగా చాట్ చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయిందని పేర్కొన్నారు. కాగా ఆయన నటించిన ‘హిట్-3’ మే 1న రిలీజ్ కానుంది.
News April 25, 2025
డెత్ ఓవర్లలో RR బోల్తా.. ఏం జరుగుతోంది?

ఈ సీజన్లో RR ఛేజింగ్ డెత్ ఓవర్లలో విఫలమవుతోంది. వరుసగా 3 గెలవాల్సిన మ్యాచ్లలో ఓడిపోయింది. APR 16న(vsDC) చివరి ఓవర్లో 9 రన్స్ కావాల్సి ఉండగా టై చేసుకుని సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది. APR 19న(vsLSG) 6 బంతుల్లో 9 రన్స్ చేయాల్సి ఉండగా 2 రన్స్ తేడాతో ఓడింది. నిన్న RCBతో మ్యాచ్లో 12 బంతుల్లో 18 రన్స్ చేయలేక 11 పరుగుల తేడాతో మట్టికరిచింది. దీంతో ఏం జరుగుతోందంటూ RR ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News April 25, 2025
NRML: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్లో ఒకరు, ఆదిలాబాద్లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.