News June 22, 2024
నందవరం అటవీ ప్రాంతంలో పులి కలకలం

మర్రిపాడు మండలం నందవరం అటవీ ప్రాంతంలో ఏఎమ్ఆర్ గార్డెన్ వద్ద పులి కనబడిందని శనివారం స్థానికంగా కలకలం రేగింది. ఓ వ్యక్తి పులిని చూసినట్లు గ్రామస్థులకు తెలిపాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. అధికారులు అది పులి కాదని ఐన అనే జంతువు అని నిర్ధారించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Similar News
News December 3, 2025
నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.
News December 3, 2025
నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.
News December 3, 2025
Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.


