News February 9, 2025
నందవరం చౌడేశ్వరి దేవి చరిత్ర మీకు తెలుసా?

బనగానపల్లె(M) నందవరంలో చౌడేశ్వరి దేవి ఆలయం ఉంది. బ్రాహ్మణులకు సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు వారణాసి నుంచి నందవరానికి సొరంగం ద్వారా ఒకే రోజు వచ్చారని భక్తులు నమ్ముతారు. 4వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం చూడటానికి చాలా భయంకరంగా ఉండేదని ఆ ఊరి పూర్వీకులు చెబుతుంటారు. ఆ తర్వాత వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం ముందే సొరంగం ఉందని.. 10 మెట్లు దిగితే అమ్మవారి పాదాలు కనపడతాయని చెబుతారు.
Similar News
News February 26, 2026
గంగ-కావేరీ అనుసంధానం నా కోరిక: CBN

AP: గంగ-కావేరీ నదుల అనుసంధానం జరగాలన్నది తన కోరిక అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నదుల అనుసంధానం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. వంశధార నుంచి పెన్నా వరకు ఇది జరగాలి. అప్పుడే రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా పోతుంది’ అని అసెంబ్లీలో అన్నారు. నల్లమల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదని చెప్పారు. తెలంగాణ వాళ్లు ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పొద్దని కోరారు.
News February 26, 2026
భద్రాద్రి కొత్త కలెక్టర్ అంకిత్ నేపథ్యం ఇదే..!

భద్రాద్రి జిల్లా కలెక్టర్గా 2019 బ్యాచ్కు చెందిన IAS అధికారి అంకిత్ నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న ఆయన తాజా బదిలీలలో భాగంగా రానున్నారు. అంకిత్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. నిజామాబాద్లో పరిపాలనా వ్యవస్థలో అన్ని విభాగాల సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.
News February 26, 2026
రైతు నేస్తం.. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కలెక్టర్గా పనిచేసిన జితేష్ వి పాటిల్ TGNPDCL సీఎండీగా బదిలీ అయ్యారు. తన పదవీ కాలంలో నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ముఖ్యంగా సాగు రంగంలో వినూత్న మార్పుల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మునగ, ఆయిల్పామ్ సాగుతో పాటు చేపలు, బాతుల పెంపకం, వర్మీ కంపోస్టు తయారీపై రైతులను ప్రోత్సహిస్తూ రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు.


