News February 9, 2025
నందవరం చౌడేశ్వరి దేవి చరిత్ర మీకు తెలుసా?

బనగానపల్లె(M) నందవరంలో చౌడేశ్వరి దేవి ఆలయం ఉంది. బ్రాహ్మణులకు సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు వారణాసి నుంచి నందవరానికి సొరంగం ద్వారా ఒకే రోజు వచ్చారని భక్తులు నమ్ముతారు. 4వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం చూడటానికి చాలా భయంకరంగా ఉండేదని ఆ ఊరి పూర్వీకులు చెబుతుంటారు. ఆ తర్వాత వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం ముందే సొరంగం ఉందని.. 10 మెట్లు దిగితే అమ్మవారి పాదాలు కనపడతాయని చెబుతారు.
Similar News
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్పై ఈ రైడ్స్ జరిగాయి.
News November 24, 2025
కొమురం భీమ్కు SP నివాళి

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నితికా పంత్ కెరమెరి (M) జోడేఘాట్లోని ఆదివాసీ నాయకుడు కొమరం భీమ్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎస్పీ, ఏఎస్పీకి ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘనస్వాగతం పలికారు. గిరిజన ఆచార సంప్రదాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిజన ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
News November 24, 2025
సంగారెడ్డి: రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి పిలవాలని చెప్పారు. జిల్లాలోని 15,926 మహిళా సంఘాలకు 16.78 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


