News April 7, 2025
నందికొట్కూరు: టేకు ఆకుపై సీతారాముల కళ్యాణ చిత్రం

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు వినూత్నంగా టేకు ఆకుపై సీతారాముల కళ్యాణం చిత్రం గీశారు. ఆయన మాట్లాడుతూ.. అంతా రామమయం, జగమంతా రామమయం, ఈ లోకంలోని సమస్త జనులకు రామాయణ మహాకావ్యం ఆదర్శవంతమైనదని తెలిపారు. సీతారామ చంద్రుల ఆశీస్సులు ప్రజలందరిపై కురిపించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News December 6, 2025
నంద్యాలలో ఘనంగా 63 వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా 63 హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హోంగార్డులు నైపుణ్యతను పెంచుకొని పోలీసులకు దీటుగా విధి నిర్వహణ చేస్తున్నారని తెలిపారు. వారి సేవలు అద్భుతమని, అభినందనీయమని తెలిపారు.
News December 6, 2025
కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
News December 6, 2025
VKB: 3వ విడతలో 909 నామినేషన్లు

వికారాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో మొత్తం 157 జీపీలకు 909 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల కోసం 3,055 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిల్లో పరిగి నియోజకవర్గంలోని మండలాల్లోనే 1,340 వార్డు స్థానాలు ఉన్నాయి. కాగా ఈ విడతలో మొత్తం 157 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుకలెక్టర్ తెలిపారు.


