News April 7, 2025

నందికొట్కూరు: టేకు ఆకుపై సీతారాముల కళ్యాణ చిత్రం

image

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు వినూత్నంగా టేకు ఆకుపై సీతారాముల కళ్యాణం చిత్రం గీశారు. ఆయన మాట్లాడుతూ.. అంతా రామమయం, జగమంతా రామమయం, ఈ లోకంలోని సమస్త జనులకు రామాయణ మహాకావ్యం ఆదర్శవంతమైనదని తెలిపారు. సీతారామ చంద్రుల ఆశీస్సులు ప్రజలందరిపై కురిపించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News December 16, 2025

తిరుపతి, చిత్తూరు జిల్లాల TDP కొత్త బాస్‌లు వీరే.!

image

తిరుపతి, చిత్తూరు జిల్లాల TDP జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం షణ్ముగం, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వనబాక లక్ష్మీని నియమించినట్లు తెలుస్తోంది. నేతలు, నాయకులు నిర్ణయం మేరకు ఈ ఎంపిక జరిగిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News December 16, 2025

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత: ఎస్పీ శబరీష్

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న డోర్నకల్, కురవి, సీరోల్, కొత్తగూడ, గంగారం మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో డీఎస్పీలు(5), సీఐలు(15), ఎస్సైలు(50) సుమారు 1000 మంది సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటారని SP పేర్కొన్నారు.

News December 16, 2025

సాయుధ దళాల నిధికి మెప్మా రూ.8 లక్షల విరాళం

image

సాయుధ దళాల పతాక నిధికి కాకినాడ జిల్లా మెప్మా సిబ్బంది సేకరించిన రూ.8,07,000 చెక్కును మంగళవారం కలెక్టరేట్‌లో అందజేశారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, మెప్మా అధికారులతో కలిసి జిల్లా సైనిక సంక్షేమ అధికారికి ఈ విరాళాన్ని అందజేశారు. మాజీ సైనికుల పునరావాసం, సంక్షేమానికి సేకరించిన ఈ విరాళం గొప్ప విశేషమన్నారు. ఇదే స్ఫూర్తితో ఇతర శాఖల సిబ్బంది విరివిగా విరాళాలు ఇవ్వాలని జేసీ కోరారు.