News October 8, 2024

నందిగం సురేశ్‌పై హత్య కేసు.. నేపథ్యమిదే.!

image

మాజీ MP నందిగం సురేశ్‌పై నమోదైన హత్య కేసులో సోమవారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. 2020లో వెలగపూడిలో 2వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో వృద్ధురాలు మృతిచెందింది. ఆ సమయంలో వృద్ధురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించి.. ఘర్షణను నందిగం సురేశ్ ప్రోత్సహించారని, కేసు నమోదు చేయాలని ధర్నాకు దిగారు. అప్పుడు కేసు నమోదు కాగా, ఇటీవల మృతురాలి బంధువులు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో విచారణ వేగవంతమైంది.

Similar News

News October 8, 2024

మంగళగిరి: పవన్‌తో భేటీ అయిన సాయాజీ షిండే

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటూ ఒక మొక్కను కూడా ఇవ్వాలని రెండు రోజుల క్రితం షిండే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఆలోచనలను పంచుకోవడానికి పవన్‌ని మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో కలిసినట్లు చెప్పారు.

News October 8, 2024

నేడు లేదా రేపు TDPలోకి మోపిదేవి వెంకటరమణ..?

image

YCP మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ నేడు లేదా రేపు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గమైన రేపల్లె, విజయవాడలోని తన సామాజికవర్గ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన TDP కండువా కప్పుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్న హయాంలో మోపిదేవి మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఆయన YCPకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News October 8, 2024

తుళ్ళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగిన ఘటన తుళ్ళూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభంపాటి శేషగిరిరావు, పావని దంపతులు. కొంతకాలంగా అత్త, కోడలికి మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కోడలి తరఫు బంధువులు, అత్తవైపు వారు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో కోడలు అత్త చెవి కొరకడంతో సగభాగం ఊడి కింద పడిపోయింది. గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లినా అతికించలేమని వైద్యులు చెప్పారు.