News February 26, 2025
నందిగాం : కంటతడి పెట్టించిన మూగ జీవి ఆవేదన!

నందిగాం మండలం హరిదాసుపురం గ్రామంలో దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ఓ కుక్క పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. అయితే స్థానికులు నీరు పోసి బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. కాసేపటికి అక్కడకు చేరుకున్న తల్లి కుక్క రోధించిన తీరు గుండెల్ని పిండేసేలా చేసింది.
Similar News
News February 27, 2025
SKLM: మెటీరియల్ అంతా సరిచూసుకోవాలి: కలెక్టర్

ఎన్నికల మెటీరియలను సరి చూసుకోవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. మైక్రో అబ్జర్వర్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, బింగో బాక్స్, బిగ్ బాక్స్ తదితర మెటిరియల్ను కలెక్టర్ పరిశీలించారు. మెటీరియల్పై భద్రత వహించాలని పోలీంగ్ సిబ్బందికి చెప్పారు.
News February 26, 2025
నందిగం: ఉపాధ్యాయుడిపై కేసు నమోదు.. అరెస్ట్

నందిగం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కొండాల గోపాలం అనే ఉపాధ్యాయుడిపై ఇటీవల నందిగం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి టెక్కలి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ మహమ్మద్ ఆలీ తెలిపారు. పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News February 26, 2025
సోంపేట: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

సోంపేట మండలం బారువాకొత్తూరు గ్రామంలో యువతి ఆత్మహత్య విషాదాన్ని నింపింది. బట్టిగళ్ళురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గ్రామానికి చెందిన వాలిశెట్టి తులసి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.