News May 12, 2024

నందిగామ: ఓటర్లతో కిక్కిరిసిన హైవే

image

రాష్ట్రానికి ఒక్కసారిగా కదిలిన ఓటర్లతో నందిగామలో హైదరాబాద్ టు విజయవాడ హైవే కిక్కిరిసింది. ఏపీ అసెంబ్లీ పోలింగ్‌కు ఒక్కరోజే సమయం ఉండటంటో ఓట్లర్లు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ టు విజయవాడ హైవే పై భారీగా రద్దీ ఏర్పడింది.

Similar News

News November 17, 2025

కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

image

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.

News November 17, 2025

కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

image

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.

News November 17, 2025

మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.