News January 18, 2025
నందిగామ మండలంలో దారుణ హత్య

నందిగామ మండల పరిధిలోని పల్లగిరి గ్రామ సమీపంలో సుబాబుల తోటలో షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తిని కర్రలతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి స్నేహితులతో సుబాబులు తోటలో మద్యం సేవించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2025
బాపులపాడు: అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
News February 12, 2025
కృష్ణా: టెన్త్ అర్హతతో 67 ఉద్యోగాలు

టెన్త్ అర్హతతో కృష్ణా జిల్లా డివిజన్లో 67 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 11, 2025
గోదావరి జిల్లాల నుంచి వచ్చే చికెన్ తీసుకోవద్దు: కృష్ణా కలెక్టర్

ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తీసుకోవల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే కోడి మాంసం, కోడి గుడ్లను తీసుకోవద్దన్నారు. జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టామన్నారు.