News February 4, 2025
నందిగామ మున్సిపల్ ఛైర్పర్సన్గా కృష్ణకుమారి

ఆసక్తికర పరిణామాల మధ్య నందిగామ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక ముగిసింది. రెండు వర్గాలు ఛైర్మన్ పదవికి పోటీపడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నిన్న జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా పడింది. చివరకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతుతో నందిగామ మున్సిపల్ ఛైర్పర్సన్గా మండవ కృష్ణకుమారిని ఎన్నుకున్నారు. ఈమె గత ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు. ఆమె అనుచరులు సంబరాలు చేసుకున్నారు.
Similar News
News October 20, 2025
ఇబ్రహీంపట్నం: వడ్డీ వ్యాపారి వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురైన ఇబ్రహీంపట్నం మం. యామాపూర్కు చెందిన ఏలేటి జనార్దన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల ప్రకారం.. జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్పల్లికి చెందిన ఓ వ్యాపారి వద్ద రూ.11 లక్షలు అప్పు తీసుకున్నారు. అధిక వడ్డీ వేధింపులతో వ్యాపారి ఆయన భూమిని సెల్ డీడ్ చేయించుకున్నాడు. అప్పు చెల్లించినా వేధింపులు కొనసాగుతుండడంతో జనార్దన్ ఆత్మహత్యకు యత్నించారు.
News October 20, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 20, 2025
భీమవరం: ఈనెల 23న ఎంపీడీఓ కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్

AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 86885 94244 ఈ నంబర్కు సంప్రదించాలన్నారు.