News February 4, 2025

నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కృష్ణకుమారి

image

ఆసక్తికర పరిణామాల మధ్య నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక ముగిసింది. రెండు వర్గాలు ఛైర్మన్ పదవికి పోటీపడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నిన్న జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా పడింది. చివరకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతుతో నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారిని ఎన్నుకున్నారు. ఈమె గత ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆమె అనుచరులు సంబరాలు చేసుకున్నారు.

Similar News

News November 6, 2025

వికారాబాద్: రాజీమార్గం అన్ని విధాలుగా మేలు: జడ్జి

image

రాజీమార్గంతో లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో నవంబర్ 15న నిర్వహించనున్న లోక్ అదాలత్‌పై పోలీసులు, న్యాయవాదులతో జడ్జి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు నచ్చజెప్పి భారీగా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

News November 6, 2025

గిగ్ వర్కర్ల సంక్షేమానికి TG ప్రత్యేక చట్టం

image

TG: రాష్ట్ర గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్-2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బిల్లును త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ చట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందిస్తుంది. ప్రధానంగా ఆదాయ భద్రత, కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు, గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.

News November 6, 2025

వీరుల రక్తపు ధారలు ప్రవహించిన పల్నాడు

image

నాటి వీరులు వాడిన ఆయుధాలనే దేవతలుగా పూజించే ఆచారం పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోతురాజుకు పడిగం కట్టి పల్నాటి వీరుల ఉత్సవాలకు పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మినీ మహాభారతంగా, ఆంధ్ర కురుక్షేత్రంగా పిలవబడే పల్నాటి యుద్ధ సన్నివేశాలను ఈ ఉత్సవాలలో నిర్వహిస్తారు.