News March 28, 2025
నందిమల్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామంలోని పెద్ద చెరువులో ఒక వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజ్ (30) శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. బెండుపై కూర్చొని వల విసురుతుండగా ప్రమాదవశాత్తు బెండుపై నుంచి జారిపడి వలలో చిక్కుకొని మృతి చెందాడు. కాగా మృతునికి భార్య పావనితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
Similar News
News November 15, 2025
మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇదేం దోపిడీ!

ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు వచ్చే ప్రేక్షకులను మల్టీప్లెక్స్ థియేటర్లు దోచుకుంటున్నాయి. ఇంటర్వెల్లో ఇష్టం వచ్చిన రేట్లతో స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. మల్టీప్లెక్స్లలో రూ.20ల ఎగ్ పఫ్, కూల్ డ్రింక్ రూ.80, రూ.5 సమోసా రూ.20, పాప్ కార్న్ రూ.100 వరకు అమ్ముతూ ప్రేక్షకులను ముంచుతున్నారు. ఈ అధిక ధరలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్లోని 4 మల్టీప్లెక్స్లలో ఈ పరిస్థితి ఉంది.
News November 15, 2025
ఎగ్ షెల్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ వివిధ రకాల పద్ధతులను ఎంచుకుంటారు. వాటిల్లో ఒకటే ఎగ్ షెల్ పేరెంటింగ్. ఇందులో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికీ పంపకుండా తమ వద్దే ఉంచుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లి అందరితో కలిస్తేనే నైపుణ్యాలు వస్తాయి. సమస్యల్ని, సవాళ్లని తమంతట తాము పరిష్కరించుకునేలా తయారవుతారు. అన్నిట్లో తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. కాబట్టి ఇలాంటి విధానం పిల్లలకు మంచిది కాదంటున్నారు నిపుణులు.
News November 15, 2025
జూబ్లీహిల్స్ విజయం.. కాంగ్రెస్ వెంటే TDP ఓటర్లు!

TG: జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపునకు TDP ఓటు బ్యాంక్ కలిసొచ్చినట్టు తెలుస్తోంది. నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్, మాగంటి గోపీనాథ్ అప్పట్లో కోర్ TDP నేతలు. మాగంటి 2014లో TDP నుంచి గెలిచి BRSలో చేరారు. ఇక CM రేవంత్ సైతం అమీర్పేట్లో NTR విగ్రహం పెడతానని చెప్పడం, గ్రౌండ్ లెవెల్లో ఓ సామాజిక వర్గంతో సమావేశమై మద్దతు కూడగట్టారు. అటు BRS, BJP కూడా ఆశలు పెట్టుకున్నా ఆ పార్టీ ఓటర్లు INCకే జైకొట్టాయి.


