News March 28, 2025
నందిమల్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామంలోని పెద్ద చెరువులో ఒక వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజ్ (30) శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. బెండుపై కూర్చొని వల విసురుతుండగా ప్రమాదవశాత్తు బెండుపై నుంచి జారిపడి వలలో చిక్కుకొని మృతి చెందాడు. కాగా మృతునికి భార్య పావనితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
Similar News
News November 27, 2025
సారంగాపూర్: ‘ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి’

సారంగాపూర్ మండలం కోనాపూర్, అర్పపల్లి, ధర్మానాయక్ తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు వేగంగా చేయాలని ఆదేశించారు. 17% తేమ ఉన్నా సన్న, దొడ్డు రకాలు తప్పనిసరిగా కొనాలన్నారు.
News November 27, 2025
పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.
News November 27, 2025
సారంగాపూర్: ‘వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

సారంగాపూర్ మండలం అర్పపల్లి జెడ్పీహెచ్ఎస్ను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత గురువారం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనం నాణ్యత, మెనూ, రిజిస్టర్లను తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. గైర్హాజరైన విద్యార్థిని అక్షిత ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.


