News February 20, 2025
నంద్యల: గమనిక.. బస్సుల రూటు మార్పు

కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో నుంచి కర్నూలుకు వెళ్లే బస్సుల మార్గంలో స్వల్ప మార్పులు చేసినట్లు కోవెలకుంట్ల డిపో మేనేజర్ తిరుపతయ్య పేర్కొన్నారు. జాతీయ రహదారి NH-340B చెన్నంశెట్టి పల్లె నుంచి బేతంచెర్ల వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున బేతంచెర్ల నుంచి కర్నూలు వెళ్లే బస్సులు సిమెంట్ నగర్, తమ్మరాజు పల్లె, సోమయాజుల పల్లె మీదుగా నేటి నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
Similar News
News February 23, 2026
ఫౌండేషన్ రాసుకుంటే ఇలా అవుతోందా?

మేకప్లో ముఖ్యమైన పార్ట్ ఫౌండేషన్. దీని ఎంపికలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ముఖం డల్గా మారుతుంది. ఇలా కాకుండా ఉండటానికి కొన్ని టిప్స్.. సరైన షేడ్ ఎంచుకోవాలి. మీ షేడ్ కన్నా లైటర్ షేడ్ ఎంచుకుంటే ఫ్లేకీగా కనిపిస్తుంది. స్కిన్ కేర్, ఫౌండేషన్ సేమ్ బేస్డ్వి తీసుకోవాలి. కొన్ని ఫౌండేషన్స్ స్కిన్ ఆయిల్స్తో కలిసి టైమ్ గడిచేకొద్దీ ఆక్సిడేషన్ చెందుతాయి. కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.
News February 23, 2026
వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు పూర్తి సన్నాహాలు: ఎస్ఈ గంగాధర్

NPDCL పరిధిలో విద్యుత్ డిమాండ్ 5,904 మెగావాట్లకు చేరిందని PDPL సర్కిల్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. వేసవిలో పీక్ లోడ్ను ఎదుర్కొనేందుకు 126 కొత్త డీటీల ఏర్పాటు, 12 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 11 సబ్స్టేషన్లు నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. 26 బ్రేకర్లు, 15 ఇంటర్లింకింగ్ లైన్లు ఏర్పాటు చేసి సరఫరా నాణ్యత మెరుగుపరిచామని, అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు సన్నాహాలు పూర్తిచేసినట్లు స్పష్టం చేశారు.
News February 23, 2026
TGలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు

TG: ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల కోసం 1,495 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. 9AM నుంచి 12PM వరకు పరీక్షలు జరుగుతాయని, స్టూడెంట్స్ 1hr ముందే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని బోర్డు సూచించింది. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతిస్తామని, HTలు జారీ చేయని కాలేజీలపై చర్యలుంటాయని హెచ్చరించింది.


