News February 20, 2025
నంద్యల: గమనిక.. బస్సుల రూటు మార్పు

కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో నుంచి కర్నూలుకు వెళ్లే బస్సుల మార్గంలో స్వల్ప మార్పులు చేసినట్లు కోవెలకుంట్ల డిపో మేనేజర్ తిరుపతయ్య పేర్కొన్నారు. జాతీయ రహదారి NH-340B చెన్నంశెట్టి పల్లె నుంచి బేతంచెర్ల వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున బేతంచెర్ల నుంచి కర్నూలు వెళ్లే బస్సులు సిమెంట్ నగర్, తమ్మరాజు పల్లె, సోమయాజుల పల్లె మీదుగా నేటి నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
తణుకులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
News December 1, 2025
బాధితుల సమస్యలను పరిష్కరించాలి: ADB SP

ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యత అధికంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 28 ఫిర్యాదులు అందగా వాటిని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్కు తెలియజేయలన్నారు. ఆయనతో పాటు సీసీ కొండరాజు ఉన్నారు.
News December 1, 2025
సిద్దిపేట: ఎయిడ్స్ వ్యాధికి నివారణే ఆయుధం: DMHO

ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒక్కటే ప్రధాన ఆయుధం అని సిద్దిపేట DMHO ధనరాజ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ ప్రివెన్షన్ డే సందర్బంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చెసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి అవగాహనతోనే నివారించవచ్చాన్నారు.


