News March 9, 2025

నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. శనివారం తీవ్ర వేడి వాతావరణం కొనసాగడంతో పాటు వడ గాల్పులు వీచాయి. ఈ క్రమంలో నంద్యాలలో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోపక్క కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో రాత్రి సమయంలో చలి తీవ్రత పెరిగింది. దీంతో పగలు ఎండలు, రాత్రి చలికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Similar News

News November 24, 2025

సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

image

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.

News November 24, 2025

సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

image

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.

News November 23, 2025

కూటమి పార్టీలకు సమాన గుర్తింపు: ఎంపీ

image

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. పంచలింగాలలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ముగించేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి టీడీపీ-జనసేన-బీజేపీలను కూటమిగా ఏకం చేశారని అన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలకు సమాన గుర్తింపు ఉంటుందన్నారు.