News March 30, 2025
నంద్యాలలో ఆకస్మిక తనిఖీలు

నంద్యాల పట్టణం నందమూరి నగర్లోని ఆవాసియ విద్యాలయాన్ని బుడగజంగాల రాష్ట్ర సమగ్ర శిక్ష ఐఈడీకో ఆర్డినేటర్ కల్పనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. భోజనాలు, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వెంట సీఆర్పిీ హిమశేఖర్, చంద్రమ్మ , గాయత్రి , హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
మీరేం చేస్తున్నారు?: కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ HC

ఇండిగో విషయంలో కేంద్రం స్పందనపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ప్రయాణికుల కోసం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేంటి?’ అని ప్రశ్నించింది. అటు ఇదే టైమ్ అని ఇతర సంస్థలు డొమెస్టిక్ ఛార్జీలు ₹40వేలకు పెంచడాన్ని తప్పుబట్టింది. వారిని కట్టడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా నోటీస్ ఇవ్వడంతో సారీ చెప్పాయని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. దీంతో మీరు సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి వస్తుందా? అని నిలదీసింది.
News December 10, 2025
పలమనేరు-కుప్పం హైవేపై లారీ-RTC బస్సు ఢీ

పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని వీకోట(M) జీడీగుట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి కుప్పం వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీడీగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం PES, ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 10, 2025
ఇండి‘గోల’: ఈ రోజు 77 విమానాలు రద్దు

ఇండిగో విమానాల రద్దు పరంపర పర్వం కొనసాగుతూనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు(బుధవారం) 77 విమానాలు రద్దయ్యాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి వెళ్లే 37 ఇండిగోవిమానాలు.. రావాల్సిన 40 విమానాలు రద్దయ్యాయని ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికులందరికీ ముందుగానే ‘విమానాల రద్దు’ సమాచారం ఇచ్చామని తెలిపారు.


