News January 25, 2025
నంద్యాలలో డ్రోన్ల వినియోగంతో ట్రాఫిక్ పర్యవేక్షణ

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాలలోని సంజీవ నగర్ గేట్, మున్సిపల్ ఆఫీస్, శ్రీనివాస సెంటర్లో శుక్రవారం ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు డ్రోన్లను వినియోగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారులకు వివరించారు.
Similar News
News December 21, 2025
ఎయిమ్స్ న్యూరాలజీలో సూర్యాపేట యువతి ప్రతిభ

సూర్యాపేటకి చెందిన డాక్టర్ వూర నీతు శ్రీ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఎయిమ్స్ (AIIMS) నిర్వహించిన డి.ఎం న్యూరాలజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 34వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నీతు శ్రీ కష్టపడి ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్నారు. ఆమె ప్రతిభను పలువురు ప్రముఖులు అభినందించారు.
News December 21, 2025
సండే స్పెషల్.. OTTలో ఈ సినిమా చూశారా?

ప్రియదర్శి, ఆనంది కాంబినేషన్లో తెరకెక్కిన ‘ప్రేమంటే’ చిత్రం NETFLIXలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో భార్యాభర్తలుగా హీరోహీరోయిన్ల నటన మెప్పిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్. వెన్నెల కిశోర్, యాంకర్ సుమ రోల్స్ నవ్వులు పూయిస్తాయి. ఈ డీసెంట్ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చు. కాగా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది.
News December 21, 2025
MDK: మూడేళ్ల కొడుకును హత్య చేసిన కసాయి తండ్రి

తనకు పుట్టలేదని అనుమానంతో కుమారుడిని చంపిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ మండలం పెద్దబ్బాయి తండాకు చెందిన భాస్కర్కు అదే మండలానికి చెందిన ఒక మహిళతో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. భాస్కర్ కొట్టాడని కొడుకుని అతని వద్ద వదిలి భార్య పుట్టింటికి వెళ్ళింది. దీంతో కొడుకును హత్య చేసిన భాస్కర్ పరారీలో ఉన్నట్టు తెలిపారు.


