News March 23, 2025
నంద్యాలలో వార్డెన్పై పోక్సో కేసు

నంద్యాలలోని ఓ స్కూల్ హాస్టల్ వార్డెన్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరిట మాయమాటలతో మభ్యపెట్టి.. బాలికను తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 22, 2025
AP న్యూస్ రౌండప్

✒ పలు జిల్లాలకు ఆకస్మిక వరదలొచ్చే ఆస్కారం.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని Dy.CM పవన్ ఆదేశాలు
✒ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ఈ నెల 23న తమ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ: YCP
✒ ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తి: మంత్రి పార్థసారథి
✒ అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం: చెల్లుబోయిన వేణు
News October 22, 2025
సిరిసిల్ల: 108 అంబులెన్స్లలో ఆకస్మిక తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ జనార్దన్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ తో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అంబులెన్స్లలోని ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్, మానిటర్, మందుల ఎక్స్పైరీ, వాహనాల కండిషన్తో పాటు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో 108 సిబ్బంది పాల్గొన్నారు.
News October 22, 2025
నెల్లూరు: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మురళీధర్, అతని భార్య జలజ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మురళీధర్ మృతి చెందగా.. జలజను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు.