News March 25, 2025
నంద్యాల: ‘అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి’

నంద్యాల జిల్లాలోని 15, 77, 936 రేషన్ కార్డుదారుల్లో ఇప్పటి వరకు 14,04,647 మంది ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు వెంటనే చేయించుకోవాలని జేసీ విష్ణుచరణ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. 1,73,289 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదని చెప్పారు. కార్డుదారులందరూ తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పాస్ మిషన్ల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేయించుకోవాలని సూచించారు.
Similar News
News November 4, 2025
వరంగల్: భారీగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,200 ధర పలకగా.. ఈరోజు రూ.17,800 అయింది. అలాగే, వండర్ హాట్ (WH) మిర్చికి రూ.15,500 ధర వస్తే.. నేడు రూ.16,200 అయింది. మరోవైపు, తేజ మిర్చి ధర నిన్న రూ.14,000 ధర ఉంటే.. మంగళవారం 15,100 అయింది.
News November 4, 2025
వరి కోతలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

వరి వెన్నులో 80-90% గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలి. ఈ దశలో గింజల్లో తేమ 18-24% వరకు ఉంటుంది. గింజలు పూర్తిగా ఎండే వరకు ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గి, గింజలపై పగుళ్లు ఏర్పడి ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక శాతం పెరుగుతుంది. గింజలలో తేమ శాతం తగ్గించడానికి పనలను 4 నుంచి 5 రోజులు చేనుపై ఎండనివ్వాలి. పనలను తిరగతిప్పితే సమానంగా ఎండుతాయి.
News November 4, 2025
వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,920 పలకగా.. నేడు రూ. 30 పెరిగి, రూ.6,950 అయినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. మార్కెట్కు సుమారు 12 వేల పత్తి బస్తాలు వచ్చినట్లు చెప్పారు. కాగా వర్షం కారణంతో మార్కెట్లో కొనుగోళ్లకు అంతరాయం కలిగింది.


