News March 25, 2025

నంద్యాల: ‘అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి’

image

నంద్యాల జిల్లాలోని 15, 77, 936 రేషన్ కార్డుదారుల్లో ఇప్పటి వరకు 14,04,647 మంది ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు వెంటనే చేయించుకోవాలని జేసీ విష్ణుచరణ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. 1,73,289 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదని చెప్పారు. కార్డుదారులందరూ తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పాస్ మిషన్ల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేయించుకోవాలని సూచించారు.

Similar News

News December 8, 2025

వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్‌ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.

News December 8, 2025

హనుమాన్ చాలీసా భావం – 32

image

రామ రసాయన తుమ్హరే పాసా|
సదా రహో రఘుపతి కే దాసా||
ఓ ఆంజనేయా! నీ దగ్గర రామ నామం అనే శక్తిమంతమైన అమృతం ఉంది. ఈ శక్తి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే నువ్వు ఎల్లప్పుడూ రఘుపతికి నమ్మకమైన, గొప్ప దాసుడివిగా ఉండగలుగుతున్నావు. శ్రీరాముడిపై నీకున్న అనంతమైన భక్తికి, ఆ రామనామమే మూలం. ఆ రామనామ శక్తితోనే నీకు అన్నీ సాధ్యమయ్యాయి. ఆ శక్తులతోనే మమ్ము కాపాడు తండ్రీ! <<-se>>#HANUMANCHALISA<<>>

News December 8, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ కలెక్టర్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదుల వెల్లువ
➤ రావికమతంలో విద్యార్థినిపై దాడి చేసిన కోతి
➤ చీడికాడలో 108 లో ప్రసవించిన మహిళ
➤ జీవో నెంబర్ 36 అమలు కోరుతూ సహకార ఉద్యోగుల నిరసన
➤ అనకాపల్లిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే కొణతాల
➤ చిత్రలేఖనంలో ప్రతిభ కనబరిచిన మాడుగుల విద్యార్థికి సన్మానం
➤ గరిసింగి రామాలయం నుంచి జారిపడి విద్యార్థి మృతి