News March 25, 2025
నంద్యాల: ‘అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి’

నంద్యాల జిల్లాలోని 15, 77, 936 రేషన్ కార్డుదారుల్లో ఇప్పటి వరకు 14,04,647 మంది ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు వెంటనే చేయించుకోవాలని జేసీ విష్ణుచరణ్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. 1,73,289 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదని చెప్పారు. కార్డుదారులందరూ తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పాస్ మిషన్ల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేయించుకోవాలని సూచించారు.
Similar News
News November 15, 2025
రాగల ఐదు రోజులు జిల్లాలో పొడి వాతావరణం

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు రాగల ఐదు రోజులు జిల్లాలో పొడి వాతావరణ ఉంటుందని నోడల్ ఆఫీసర్ హరీష్ కుమార్ శర్మ తెలిపారు. గరిష్ట పగటి ఉష్ణోగ్రత 31-32°C రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 18-19°C ఉంటుందన్నారు. ఈ వాతావరణంలో యాసంగి పంటగా శనగ, కుసుమ, ఆవాలు, బొబ్బర్లు విత్తుకోవచ్చని సూచించారు. యాసంగి పంటగా పొద్దు తిరుగుడు వేసుకోవడానికి డిసెంబర్ వరకు అనుకూలమన్నారు.
News November 15, 2025
NZB: జిల్లా ప్రజలకు సీపీ పలు సూచనలు!

జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య పలు సూచనలు చేస్తూ శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాలలో విగ్రహ ప్రతిష్టలు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ డీజే పూర్తిగా నిషేధం అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దన్నారు. డ్రోన్స్ ఉపయోగించడానికి & భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని కోరారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 15, 2025
నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధం: మంత్రి లోకేశ్

AP: ఏఐ మానవాళికి ముప్పుకాదని, అది హ్యుమానిటీని పెంచుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. CII సదస్సులో ‘AI-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందికానీ తొలగించదు. IT, ఫుడ్ ప్రాసెసింగ్లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.


