News January 28, 2025

నంద్యాల: ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరి మృతి!

image

నంద్యాల జిల్లాలో విషాద ఘటన జరిగింది. చాపిరేవులలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు దినేశ్ (10), సుబ్బమ్మ (60)గా గుర్తించారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఈ ఘటన జరిగింది.

Similar News

News November 23, 2025

తులసిపాక చెక్ పోస్టు వద్ద తనిఖీలు..248 తాబేళ్లతో పట్టుబడిన వాహనం

image

మోతుగూడెం పరిధిలోని తులసిపాక చెక్ పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఓ వాహనాన్ని ఆపి పరిశీలించారు. ఇందులో 248 తాబేళ్లు ఉండగా 18 మృతి చెందినట్లు గుర్తించారు. వీటిని రావులపాలెం-ఒడిశాకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయకుమార్ తెలిపారు. బండిని సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సిబ్బంది ఉన్నారు.

News November 23, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

* రైలు ఢీకొని గొర్రెల కాపరితో పాటు 90 గొర్రెల మృతి
*మాచారెడ్డి మహిళల ఆర్థిక ఉన్నతి తోటే రాష్ట్ర ప్రగతి సాధ్యం
* జిల్లాలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
* సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేసిన అధికారులు
* కామారెడ్డి: సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
* ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు

News November 23, 2025

ఉండి: ఆవాస్ సర్వే పరిశీలనలో కలెక్టర్

image

ఉండి రాజులపేటలో జరుగుతున్న ‘ఆవాస్’ సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం గృహ నిర్మాణ శాఖ చేపడుతున్న ఈ సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. యాప్ పనితీరు, ఆన్‌లైన్ ప్రక్రియపై వివరాలు అడిగారు. కముజు సూర్యకుమారి అనే లబ్ధిదారుని వివరాలను యాప్ ద్వారా ఆన్‌లైన్ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు.