News January 28, 2025
నంద్యాల: ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరి మృతి!

నంద్యాల జిల్లాలో విషాద ఘటన జరిగింది. చాపిరేవులలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు దినేశ్ (10), సుబ్బమ్మ (60)గా గుర్తించారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఈ ఘటన జరిగింది.
Similar News
News November 24, 2025
పెద్దపల్లి: ‘కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి’

కార్మిక సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికులు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కార్మిక సంక్షేమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుల కోసం పెద్దపల్లి 9492555258, మంథని 9492555248, గోదావరిఖని 9492555284 కార్మిక అధికారులను సంప్రదించాలని సూచించారు.
News November 24, 2025
కామరెడ్డి: చెక్కులు ఇచ్చింది వీళ్లకే..!

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు KMR ఎస్పీ రాజేష్ చంద్ర భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గాంధారి PSకు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్, పిట్లం PSకు చెందిన కె. బుచ్చయ్య మృతిచెందారు. SBI పోలీస్ సాలరీ ప్యాకేజ్ స్కీమ్ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇన్సూరెన్స్ చెక్కులను SP అందజేశారు.
News November 24, 2025
KMR: ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చొరవతో, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కామారెడ్డి జిల్లాలోని నాలుగు దేవాలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ పథకాన్ని మంజూరు చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. చరిత్ర కలిగిన దేవాలయాలు నిర్వహణ లేక శిథిలమవుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా ఆలయాల్లో నిత్యం పూజలు జరిగేందుకు, అర్చకుల పోషణకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. అర్చకుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు.


