News March 19, 2025

నంద్యాల: ఇద్దరు అధికారులు సస్పెండ్ సస్పెండ్.. విధుల్లో చేరేందుకు పైరవీ..?

image

శ్రీశైలం ప్రాజెక్టు జలవనరుల శాఖకు చెందిన ఇద్దరు EEలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు అధికారులను గతేడాది సెప్టెంబరులో శ్రీశైలానికి బదిలీ చేసింది. అయితే వారు ఇప్పటికీ విధుల్లో చేరలేదు. దీంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్.. తాజాగా వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వారు విధుల్లో చేరేందుకు కార్యాలయం వద్ద పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 19, 2025

SRH జెర్సీలో మహ్మద్ షమీ.. పిక్ వైరల్

image

ఐపీఎల్ 2025 కోసం మహ్మద్ షమీ సన్నద్ధమవుతున్నారు. SRH జెర్సీ ధరించి ఆయన ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో షమీని SRH రూ.10 కోట్లకు దక్కించుకుంది. జట్టు పేస్ దళాన్ని షమీ నడిపించనున్నారు.

News March 19, 2025

వనపర్తి: త్వరలోనే ముస్లింలకు ఇఫ్తార్ విందు..

image

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు విషయంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

News March 19, 2025

ALERT: రేపు 59 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 59 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం-15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి-2, కాకినాడ-3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా అట్లూరులో 41.2, ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

error: Content is protected !!