News March 2, 2025

నంద్యాల: కనిపించిన నెలవంక.. ప్రారంభమైన రంజాన్ మాసం

image

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ముస్లిం మత పెద్దలు ఖాదర్ వలీ, మహబూబ్ ఖాన్ తదితరులు వెల్లడించారు. దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన ఉపవాస దీక్షలను స్వీకరించనున్నారు. 

Similar News

News December 13, 2025

‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’

image

TG: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో 3 స్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్‌లకు HYD పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ‘డ్రగ్స్ దొరికితే యాజమాన్యానిదే బాధ్యత. పార్కింగ్‌ సహా అంతటా CCTVలు ఉండాలి. బయట రా.10 గం.కు సౌండ్‌ సిస్టమ్‌ ఆపాలి. లోపల 45 డెసిబుల్స్‌తో ఒంటిగంట వరకే అనుమతి. డ్రంకెన్ డ్రైవ్‌కు రూ.10 వేలు ఫైన్, 6నెలల జైలు/లైసెన్స్ రద్దు. తాగిన వారికి డ్రైవర్లు/క్యాబ్‌లు నిర్వాహకులే ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు.

News December 13, 2025

డెల్టా హాస్పిటల్స్‌లో 100 రోజుల్లో 60 రోబోటిక్ శస్త్రచికిత్సలు

image

రాజమండ్రిలోని డెల్టా హాస్పిటల్స్‌లో కేవలం 100 రోజుల్లో 60కి పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్టు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నితిన్ రిమ్మలపూడి (ఎంఎస్ సర్జన్) తెలిపారు. గాల్ బ్లాడర్, హెర్నియా, గర్భాశయ, బేరియాట్రిక్, థైరాయిడ్ శస్త్రచికిత్సలను ఈ ఆధునిక పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సాంకేతికత వలన పేషెంట్లు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో త్వరగా కోలుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

News December 13, 2025

పల్నాడు: మల్లమ్మ సెంటర్‌కు ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా..!

image

నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ అంటే తెలియని వారు ఉండరు. వినుకొండ, సత్తెనపల్లి, పల్నాడు, గుంటూరు వెళ్లే 4 మార్గాలను కలిపే కూడలిని మల్లమ్మ సెంటర్ అంటారు. ఈ కూడలిలో చందనం మల్లమ్మ 1945లో మిఠాయి దుకాణం ప్రారంభించారు. ఆమె చేసిన మిఠాయిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీసుకెళ్లటంతో మల్లమ్మ షాపు ప్రజలకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పెద్ద బజారుగా ఉన్న ఆ కూడలికి 1970 నుంచి మల్లమ్మ సెంటర్‌గా వాడుకలోకి వచ్చింది.