News March 2, 2025

నంద్యాల: కనిపించిన నెలవంక.. ప్రారంభమైన రంజాన్ మాసం

image

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ముస్లిం మత పెద్దలు ఖాదర్ వలీ, మహబూబ్ ఖాన్ తదితరులు వెల్లడించారు. దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన ఉపవాస దీక్షలను స్వీకరించనున్నారు. 

Similar News

News December 18, 2025

విజనరీ లీడర్‌కు కంగ్రాట్స్: పవన్

image

AP: ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు <<18602632>>ఎంపికైన<<>> సీఎం చంద్రబాబుకు Dy.CM పవన్ కంగ్రాట్స్ చెప్పారు. IT, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, మెరుగైన పాలనలో ఆయన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ‘CBN ఒక విజనరీ లీడర్. ఆయన పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేస్తోంది. దేశం, రాష్ట్రాన్ని వృద్ధి పథంలో నడిపించేందుకు ఆయనకు బలం చేకూరాలి’ అని ట్వీట్ చేశారు.

News December 18, 2025

వారికి నీళ్లిచ్చి మీ బాటిల్ సంగతి చూద్దాం: CJI

image

ప్యాకేజ్డ్ ఫుడ్, వాటర్ బాటిళ్లకు WHO ప్రమాణాలు పాటించేలా FSSAIని ఆదేశించాలని దాఖలైన పిల్‌పై CJI ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది అర్బనైజ్డ్ రిచ్ ఫోబియా’ పిల్ అని పేర్కొన్నారు. ‘ముందు దేశంలో తాగేందుకు మంచి నీళ్లు లేని వారి గురించి ఆలోచిద్దాం. బాటిళ్ల సంగతి తర్వాత చూద్దాం. గాంధీ తొలిసారి దేశానికి వచ్చి కుగ్రామాలకు వెళ్లినట్లు మీరూ పర్యటిస్తే పరిస్థితి తెలుస్తుంది’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

News December 18, 2025

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై పునరాలోచన?

image

TDP జిల్లా అధ్యక్ష పదవిపై అధిష్ఠానం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల కిమిడి నాగార్జున పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం DCCB ఛైర్మన్‌గా నాగార్జునకు ఆ బాధ్యతలు నిర్వహించడమే సవాల్ అని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో.. ఈ రెండు బాధ్యతల్ని నెగ్గుకురావడం సులభం కాదని కొందరు నేతలు అధిష్ఠానంకు తెలిపినట్లు సమాచారం.