News March 2, 2025
నంద్యాల: కనిపించిన నెలవంక.. ప్రారంభమైన రంజాన్ మాసం

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ముస్లిం మత పెద్దలు ఖాదర్ వలీ, మహబూబ్ ఖాన్ తదితరులు వెల్లడించారు. దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన ఉపవాస దీక్షలను స్వీకరించనున్నారు.
Similar News
News January 8, 2026
అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

AP: RTC అద్దె బస్సుల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసులిచ్చారు. బస్సు అద్దె పెంచాలని అందులో డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని, అదనంగా నెలకు రూ.15-20వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 2,500 వరకు అద్దె బస్సులుండగా, సమ్మెకు దిగితే సంక్రాంతి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
News January 8, 2026
సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలి: కలెక్టర్

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.
News January 8, 2026
నల్గొండ: చికిత్స వికటించి మూడేళ్ల బాలుడు మృతి

పట్టణంలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స వికటించి <<18802666>>మూడేళ్ల బాలుడు<<>> మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు.. నిమోనియాతో డిసెంబర్ 31న బాలుడిని ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స అందిస్తున్న డాక్టర్లు త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గురువారం సెలైన్ ఎక్కించిన కొద్దిసేపటికే బాలుడు మరణించాడు. నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


