News March 2, 2025

నంద్యాల: కనిపించిన నెలవంక.. ప్రారంభమైన రంజాన్ మాసం

image

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ముస్లిం మత పెద్దలు ఖాదర్ వలీ, మహబూబ్ ఖాన్ తదితరులు వెల్లడించారు. దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన ఉపవాస దీక్షలను స్వీకరించనున్నారు. 

Similar News

News December 12, 2025

స్థానిక ఎన్నికలు.. ర్యాలీలు, సభలు నిషేధం: సీపీ

image

స్థానిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తక్షణమే విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, సభలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

News December 12, 2025

కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మిరపకు నల్ల తామర ముప్పు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీని వల్ల మిరప పంటకు నల్ల తామర ముప్పు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పురుగులు మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీంతో ఆకులు, కాయలు రాలిపోతాయి. మొక్క పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల వృద్ధి ఎక్కువ. ఆకు ముడత వ్యాప్తికి నల్ల తామర పురుగులు వాహకాలుగా పనిచేస్తాయి.

News December 12, 2025

ఫోర్ట్ వరంగల్‌కు చేరుకున్న ఒయాసిస్ జనని యాత్ర!

image

దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఓయాసిస్ జనని యాత్ర వరంగల్‌కు చేరుకుంది. టైర్ I, ఈ, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఒయాసిస్ ప్రతినిధులు తెలిపారు. ఫోర్ట్ వరంగల్ తర్వాత ఈ జనని యాత్ర, రాష్ట్రంలో భూపాలపల్లి, జమ్మికుంట, మహబూబాబాద్ ప్రాంతాల్లో యాత్ర కొనసాగనుంది.