News March 17, 2025
నంద్యాల కలెక్టరేట్కు 209 అర్జీల రాక

నంద్యాల కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా నలుమూలాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. మొత్తంగా 209 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పరిష్కరించిన 27,854 ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు.
Similar News
News December 24, 2025
మహిళలపై ఇన్ఫ్లమేషన్ ప్రభావం

ఇన్ఫ్లమేషన్ అంటే సాధారణ భాషలో వాపు అని అర్థం. క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి అనేక వ్యాధులకు ఇది కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో జననాంగ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఫైబ్రాయిడ్లు, జీర్ణ సమస్యలు, చర్మసమస్యలు వంటివి వస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 24, 2025
KNR: “వినియోగదారుడా మేలుకో”.. అడగటం నీ హక్కు

నేటి మార్కెట్ వ్యవస్థలో వినియోగదారుడే రాజు అని అంటారు. కానీ, ఆచరణలో మాత్రం తూకాల్లో తేడాలు, నాణ్యత లేని వస్తువులు, తప్పుడు ప్రకటనలతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై అవగాహన లేకపోవడం, “ఎవరు పోరాడుతారులే” అనే నిర్లక్ష్యం వ్యాపారులకు వరంగా మారుతోంది. కరీంనగర్ జిల్లాలో వినియోగదారుల కోర్టు ఉన్నా దాని వినియోగం చాలా అంటే చాలా తక్కువ. నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం.
News December 24, 2025
BMRCLలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


