News March 9, 2025

నంద్యాల కలెక్టరేట్‌లో రేపు ప్రజా వినతుల స్వీకరణ

image

నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News December 13, 2025

సూర్యాపేట: రెండో విడతలో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

image

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 8మండలాల్లో జరగనున్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 2 మండలాలు, కోదాడ నియోజకవర్గానికి చెందిన 6మండలాలు ఉన్నాయి. మొత్తం 181గ్రామ పంచాయతీలకు గాను 23గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 1,628వార్డులు ఉండగా, అందులో 339 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు, వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.

News December 13, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.

News December 13, 2025

తిరుపతి: కొత్తగా 1,251 ఉద్యోగాలు.!

image

నాయుడుపేటలోని MP SEZలో PCB తయారీ యూనిట్ ఏర్పాటుకు CIPSA TEC India Pvt Ltdకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 20 ఎకరాల భూమిని 75% రాయితీతో ఆ సంస్థకు కేటాయించింది. రూ.1,140 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టుతో ద్వారా 1,251 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 కింద తొలి 10 ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచి ప్రోత్సాహకాలను అందుకోనుంది.