News February 16, 2026
నంద్యాల: గాజులపల్లి టన్నెల్ పూర్తి

రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గజూలపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.
Similar News
News March 17, 2026
చదువులో కాకపోయినా.. క్రికెట్లో 80% కొట్టేసిన సూర్యకుమార్

కెప్టెన్గా సూర్యకుమార్ విన్నింగ్ పర్సంటేజ్ 80% దాటింది. ‘చదువులో నాకు ఎప్పుడూ 50-60% కూడా దాటలేదు. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజీని క్రికెట్లో సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ఫ్యామిలీ మొదట్లో చదువుపై ఫోకస్ చేయమన్నా.. తర్వాత తన ప్యాషన్ను గుర్తించి సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. WC నెగ్గిన తర్వాత కూడా తన భార్య దేవిషా తనలో అహంకారం పెరగకుండా చూస్తోందన్నారు.
News March 17, 2026
VZM: పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వీసీ అనంతరం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా 9వ తేదీలోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా పాసుపుస్తకాలు తయారు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. మ్యుటేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News March 17, 2026
తిరుపతిలో గరుడ వారధిపై ఇద్దరు యువకుల మృతి

బిహార్కు చెందిన ఉమేష్ కుమార్(35), తరుణ్(36) తిరుపతిలోని పవర్ టెక్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరూ స్కూటీపై వస్తూ గరుడ వారధిపై బ్లిస్ సర్కిల్ వద్ద డివైడర్ ఢీకొని రోడ్డుపై పడిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉమేష్ కుమార్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతూ తరుణ్ కుమార్ సోమవారం కన్నుమూశాడు. బంధువుల ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేశారు.


