News December 25, 2024

నంద్యాల: చనిపోతున్నా అంటూ ఫోన్.. కాపాడిన పోలీసులు

image

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కృష్ణాపురంలో శివకుమార్ అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను పురుగు మందు తాగి చనిపోతున్నానంటూ చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్ ఆదేశాల మేరకు అతడి ఫోన్ సిగ్నల్ లొకేషన్‌ను గుర్తించి పోలీసులు ఆయన్ని ఆత్మకూరు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు.

Similar News

News November 24, 2025

ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

image

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్‌ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News November 24, 2025

అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

News November 24, 2025

అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.