News March 11, 2025
నంద్యాల జిల్లాకు చేరిన 10వ తరగతి ప్రశ్న పత్రాలు.!

పదవ తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మంగళవారం నంద్యాల జిల్లాకు చేరాయి. రుద్రవరం పరిధిలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలకు చెందిన ఈ ప్రశ్నా పత్రాలను, పాఠశాల HM సుబ్బరాయుడు, పరీక్షల నిర్వహణ చీఫ్ అనురాధ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ బాలగురప్ప PSకు తరలించి భద్రపరిచారు. ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
Similar News
News December 4, 2025
CBN దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు: జగన్

AP: సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. శ్రీవారిని ఆయన అభాసుపాలు చేశారని దుయ్యబట్టారు. ‘నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్నారు. ఆ నెయ్యితో చేసిన లడ్డూలు భక్తులు తిన్నారనడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? ప్రతి ట్యాంకర్ను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.
News December 4, 2025
గద్వాల్: పీఎండీడీకేవై కార్యాచరణ రూపొందించాలి: నీతి ఆయోగ్

దేశవ్యాప్తంగా పీఎండీడీకేవైకు ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ పథకం అమలుకు అధికారులు యాక్షన్ ప్లాన్ను పీఎండీడీకేవై వెబ్ సైట్లో ఈనెల 6 లోగా అప్లోడ్ చేయాలన్నారు.
News December 4, 2025
BREAKING: తిరుపతిలో ఒకరి మృతి

తిరుపతిలో గురువారం విషాద ఘటన జరిగింది. గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి కిందకు దూకి చనిపోయాడు. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని మీసేవ కేంద్రం ఎదురుగా ఈ ఘటన వెలుగు చూసింది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తి మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. అతని వివరాలు తెలిస్తే అలిపిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


