News March 11, 2025

నంద్యాల జిల్లాకు చేరిన 10వ తరగతి ప్రశ్న పత్రాలు.!

image

పదవ తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మంగళవారం నంద్యాల జిల్లాకు చేరాయి. రుద్రవరం పరిధిలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలకు చెందిన ఈ ప్రశ్నా పత్రాలను, పాఠశాల HM సుబ్బరాయుడు, పరీక్షల నిర్వహణ చీఫ్ అనురాధ, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ బాలగురప్ప PSకు తరలించి భద్రపరిచారు. ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

Similar News

News November 21, 2025

ప.గో: ప్రియుడి మోసం.. విద్యార్థిని సూసైడ్

image

భీమవరం రూరల్ మండలం కొవ్వాడలో ఈ నెల 12న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ వీర్రాజు.. నెల్లూరుకు చెందిన నిందితుడు నవీన్ రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News November 21, 2025

నేడు గ్రేటర్‌ విశాఖ కౌన్సిల్ సమావేశం

image

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరగనుండగా ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 90 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. వీటిలో ప్రధానంగా నగరంలోని వివిధ వార్డుల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్‌సప్లై వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు వ్యూహరచనలో భాగంగా వైసీపీ తరఫున షాడో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. సమావేశం ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News November 21, 2025

విశాఖలో ‘కాగ్నిజెంట్’.. JAN నుంచి కార్యకలాపాలు!

image

AP: దిగ్గజ IT కంపెనీ కాగ్నిజెంట్ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్‌ను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం.