News January 29, 2025

నంద్యాల జిల్లాకు మరో 11 మద్యం షాపులు

image

నంద్యాల జిల్లాకు ప్రభుత్వం మరో 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వీ.రాముడు ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటిలో ఈడిగ సబ్ క్యాస్ట్ కులస్థులకు 7, గౌడ్స్‌కు 3, గౌడ కులానికి చెందిన వారికి ఒకటి కేటాయించారని తెలిపారు. అర్హత కలిగిన వారు రూ.2లక్షల చొప్పున ఆన్‌లైన్లో చెల్లించి, వచ్చేనెల 5వ తేదీ నుంచి మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News December 4, 2025

విచారణ ఇంత జాప్యమా… వ్యవస్థకే సిగ్గుచేటు: SC

image

యాసిడ్ దాడి కేసుల విచారణ డేటాను సమర్పించాలని అన్ని హైకోర్టులను SC ఆదేశించింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్ల నాటి ఓ కేసు విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై CJI సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఇది వ్యవస్థకే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 2009లో యాసిడ్ దాడిలో గాయపడిన ఓ యువతి తన ఆవేదనను SCకి వినిపించారు. ముఖంపై యాసిడ్ దాడితో వైకల్యంతో పాటు దాన్ని తాగించిన ఘటనల్లో పలువురు ఆహారాన్నీ తీసుకోలేకపోతున్నారన్నారు.

News December 4, 2025

తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్

image

AP: TDP ఆధిపత్యపోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేశారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు, హంతకులు TDP వాళ్లేనని స్వయంగా SPయే చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది’ అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌పై CBN గతంలో ఒకలా మాట్లాడి ఇపుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు.

News December 4, 2025

పనిచేయని పోలీస్ వెబ్ సైట్లు.. ప్రజలకు ఇబ్బందులు

image

TG: సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ వెబ్‌సైట్‌లు పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ ఫిర్యాదుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ తర్వాత కేటుగాళ్లు పోలీస్ సైట్లలో లింకులు ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఐటీ విభాగం సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేసింది. అంతకుముందు మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.